నిత్యా మీనన్, సమంత మరోసారి స్క్రీన్ ని షేర్ చేసుబోతున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్
హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించే ఓ చిత్రంలో ఈ ముద్దుగుమ్మలిద్దరూ
నటించబోతున్నట్టు తెలుగు సినిమా సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 'సన్ అఫ్ సత్యమూర్తి' చిత్రం తరువాత నిత్యా మీనన్, సమంత మళ్ళీ కలిసి
నటించబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ విషయం గురించి ఇంకా అధికారక
ప్రకటన రావాల్సుంది. నిత్యా ప్రస్తుతం తమిళ, కన్నడ మూవీస్ తో బిజీగా ఉంది.
అలాగే సమంత ప్రస్తుతం తెలుగులో కొన్ని ప్రాజెక్టులతో బిజీగానున్న సంగతి తెలిసిందే.
అన్నీ కుదిరితే ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది.
No comments:
Post a Comment