ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ జంటగా తెరకెక్కిన 'ఆషికి 2' సినిమా
బాలీవుడ్ లో ఎంత సక్సెస్ అయ్యిందో ప్రేక్షకులకు తెలియంది కాదు. ఈ సినిమా తరువాత శ్రద్ధాకపూర్, ఆదిత్యాలకి హిందీ చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ డం ఏర్పడింది. ఈ సినిమా
తరువాత మళ్ళీ ఆదిత్య, శ్రద్ధా స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నట్టు సమాచారం.
అది కూడా సౌత్ ఇండియన్ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ మణి రత్నం
తెరకెక్కించిన 'ఓ కాదల్ కన్మణి' రీమేక్
తో. ఈ సినిమా తెలుగులో 'ఓకే బంగారం'గా డబ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్
కానుంది. ఆ సినిమాని కరణ్ జోహార్ నిర్మించే సూచనలు కనిపిస్తున్నాయి. షాద్ అలీ ఈ
చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. షాద్ అలీ ఇంతకుముందు మణిరత్నం తెరకెక్కించిన 'సఖి' చిత్రాన్ని
హిందీలో రీమేక్ చేశాడు. ఆ సినిమా హిందీలో 'సాతియ'గా రిలీజ్ అయింది.
ఇదిలా ఉంటే, మరోసారి
తెరపై తళుక్కుమనే ఆదిత్య, శ్రద్ధా
జంటనీ చూడాలనీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సారి ఆ జంట ఎలా
ఆకట్టుకుంటుందో చూడాలి.
No comments:
Post a Comment